బోర్డు తిప్పేసిన మరో ఫైనాన్స్ సంస్థ
విజయవాడ:మరో ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసిన ఘటన శుక్రవారం విజయవాడలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నగరంలో సాబ్ ఫిన్ కాప్ పేరుతో ఫైనాన్స్ సంస్థను స్థాపించారు. ఇంతటితో బాగానే ఉన్నా బ్యాంక్ రుణాలు ఇప్పిస్తామంటూ లబ్దిదారుల నుంచి భారీగా కమీషన్లు వసూలు చేశారు.
ప్రజలను నుంచి అధిక మొత్తంలో డబ్బు సేకరించిన తరువాత బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సాబ్ ఫిన్ కాప్ నిర్వాహకులపై పోలీసులను ఆశ్రయించారు.