'మా ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు'

'మా ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు'


విజయవాడ:ఉషా కార్డియాక్ సెంటర్ పై ఓ ఛానల్ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ ఆస్పత్రి ఎండీ వై.వీ.రావు తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన నర్సయ్య అనే రోగి శనివారం చనిపోతే..  మూడు రోజుల క్రితమే ఆ పేషెంట్ మరణించాడని ఆ ఛానల్ తప్పుడు కథనాలు ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం 5 గంటలకు తీసిన ఈసీజీ రిపోర్ట్ కూడా తమ వద్ద ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ పేషెంట్ ను అయిదురోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స అందించిన అనంతరం రూ.7 వేలు బిల్లు మాత్రమే వేశామన్నారు.


 


ఆ ఛానల్ సిబ్బంది  పేషెంట్ బంధువులను బెదిరించి  తప్పుడు సమాచారం చెప్పించారన్నారు. ఛానల్ పాపులారటీ కోసం తప్పడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top