కర్నూలు ఆస్పత్రిలో పాము కలకలం


కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గురువారం ఓ పాము కలకలం సృష్ట్టించింది. ఆసుపత్రి వెనుకవైపు నుంచి వచ్చిన ఓ కట్ల పాము ఎంఎం-3 వార్డులోకి చేరుకుంది. ఓ రోగి దానిని చూసి భయంతో గట్టిగా కేకలు వేశాడు. దీంతో వార్డులోని మిగతా రోగులు భయంతో ఒక్క ఉదుటున బయటకు పరుగులు తీశారు. రోగుల సహాయకులు కర్రతో ఆ పామును చంపేసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు కొరకడంతో ఓ శిశువు మృతి చెందిన విషయం మరువక ముందే కర్నూలు ఆసుపత్రిలో పాము కనిపించడం రోగుల్లో భయాందోళన నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top