కపిలతీర్ధంలో కొండచిలువ కలకలం
చిత్తూరు : తిరుపతిలో కపిలతీర్ధంలో సోమవారం కొండచిలువ కలకలం సృష్టించింది. కపిలతీర్థంలోని ఎల్లమ్మ అనే మహిళ ఇంట్లో ప్రత్యక్షమైన కొండచిలువ, ఇంట్లో ఉన్న కోళ్లపై దాడి చేసింది. వెంటనే ఈ ఘటనను చూసిన స్థానికులు కొండచిలువను బలంగా కొట్టడంతో అక్కడక్కడే పాకుతోంది. కొండచిలువ సుమారు 7 అడుగుల పొడవు ఉంది. గ్రామస్తులు కొండచిలువ విషయం అటవీ అధికారులకు తెలియజేశారు.