విద్యార్థినులతో బలవంతంగా వ్యభిచారం


ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం సాంఘీక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో ఘోరం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినుల చేత వంట మనిషి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై మాట్రిన్ జానకుమారి ఫిర్యాదు చేయటంతో జిల్లా కలెక్టర్, ఎస్పీలు పూర్తిస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top