తుళ్లూరులో సింగపూర్ బృందం రహస్య పర్యటన


గుంటూరు:ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం తుళ్లూరులో ఆదివారం సింగపూర్ బృందం రహస్య పర్యటన చేపట్టింది. ఈ మేరకు 17 మంది సింగపూర్ ప్రతినిధులు పర్యటనలో పాల్గొన్నారు. అనంతరం ఆ బృంద సభ్యులు సీఆర్డీఏ కార్యాలయంలో కమిషనర్ శ్రీకాంత్ తో సమావేశమయ్యారు. 


 


దీనిపై ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే వీరి పర్యటన కొనసాగుతోంది. రాజభవన్ భవన నిర్మాణం, హైకోర్టు తదితర అంశాలకు సంబంధించి ఈ బృందం తుళ్లురులో పర్యటన చేపట్టింది. దీనికి సంబంధించి మే 15 లోగా సింగపూర్ బృందం ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వనున్నట్లు ఏపీ మంత్రులు స్పష్టం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top