టీచర్లకు బడితెపూజ చేసిన విద్యార్థినులు

టీచర్లకు బడితెపూజ చేసిన విద్యార్థినులు - Sakshi


టీచర్లకు బడితెపూజ చేసిన విద్యార్థినులు



శ్రీకాకుళం : దారి తప్పిన గురువులకు విద్యార్థినులు బడితెపూజ చేశారు. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పట్టలేని ఆవేశంతో ఊగిపోయారు. అంతే చేతికందిన వాటితో ఉపాధ్యాయులను చితక్కొట్టి వదిలారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని ప్రభుత్వ  పాఠశాలలో జరిగింది. గత కొంతకాలంగా డ్రాయింగ్‌ టీచర్‌, ఇంగ్లీష్‌ టీచర్‌ తమను లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.



వారి ఆగడాలు ఎక్కువ కావటంతో, ఈ విషయాన్ని  ఎవరూ పట్టించుకోకపోడంతో తామే రంగంలోకి దిగి ఇద్దరినీ చిత్తుగా కొట్టారు. విద్యార్థినులకు తోడు వారి కుటుంబ సభ్యులు కూడా ఉపాధ్యాయులకు దేహశుద్ధి చేశారు. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి కీచక టీచర్లను అదుపులోకి తీసుకున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top