చిలకమ్మా..చెప్పవే రామయ్యకు వస్తున్నామని

చిలకమ్మా..చెప్పవే రామయ్యకు వస్తున్నామని


రాజానగరం:  భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణోత్సవానికి భక్తులకు రామచిలుకలతో ‘పిలుపును’ అందించే కార్యక్రమం తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం వెలుగుబందలో గురువారం జరిగింది. శ్రీకృష్ణ చైతన్య సంఘం ప్రతినిధి కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో 4 రామచిలుకలను 4 వేదాలుగా పూజిస్తూ ‘శ్రీరామ’ నామాన్ని జపించారు.  ప్రత్యేకంగా ముద్రించిన రామయ్య కల్యాణోత్సవ ఆహ్వాన శుభలేఖలను చిలుకలకు కట్టి పూజించారు.  కోటి తలంబ్రాలతో భద్రాద్రికి పయనమవుతున్న సమాచారాన్ని రామయ్యకు తెలియజే యాలని కోరుతూ చిలుకలను గాలిలోకి విడిచారు.     - రాజానగరం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top