రహస్య జీవోతో చీకటి రాజ్యం

తమ్మినేని సీతారాం - Sakshi


హైదరాబాద్: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహస్య జీవోతో చీకటి రాజ్యానికి తెరలేపుతున్నారని వైఎస్ఆర్ సిపి  అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనాన్ని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు పంచుతున్నారని విమర్శించారు. చంద్రబాబు టిడిపి ముఖ్యమంత్రా ? ప్రజల ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు.



ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు కొత్తగా ఎల్లో డ్రెస్‌కోడ్ పెట్టారన్నారు. ఈ ఆదేశాలు పాటించడానికి వారు సిద్ధంగా లేరని చెప్పారు. దివంగత మహానేత వైఎస్‌ఆర్‌లా పెద్దమనసుతో ఆలోచించాలని ఆయన చంద్రబాబుకు సలహా ఇచ్చారు. వైఎస్‌ఆర్‌లా ప్రజానాయకుడిగా పనిచేయమని చెప్పారు.  ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చమని  సీతారాం కోరారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top