స్కూల్ బస్ బోల్తా, విద్యార్థులకు గాయాలు


నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం వెలగలపొన్నూరు వద్ద ఓ ప్రయివేట్ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. శనివారం ఉదయం  విద్యార్థులతో వెళుతున్న వికాస్ స్కూస్ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు, తీవ్రంగా 16మంది  విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top