చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు
ఒంగోలు : ఎస్సీలను కించపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలువురు దళితులు మంగళవారం ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోమవారం చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ విధంగా తన అగ్రకుల అహంకారాన్ని వెళ్లగక్కారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దళితలు అవమాన పడేలా మాట్లాడడం విచారకరమన్నారు.
సంబంధిత వార్తలు