పీబీసీ పనులను పరిశీలించిన సతీశ్ రెడ్డి


లింగాల: వైఎస్ఆర్ జిల్లా లింగాల కుడికాలువ, పులివెందుల బ్రాంచి కెనాల్ (పీబీసీ) పనులను శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి బుధవారం సాయంత్రం పరిశీలించారు. అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఇంజనీరింగ్ విభాగానికి చెందిన రిటైర్డ్ సీఈలు సత్యనారాయణరెడ్డి, రెహ్మాన్, హైదరాబాద్‌కు చెందిన సీఈ గిరిధర్‌రెడ్డి, కడప సీఈ వరదరాజు, ఎస్‌ఈ గోపాల్‌రెడ్డి, డీఈ రవీంద్రనాథ్ గుప్తా తదితరులు ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top