సంఘ్వీలో ‘బంగారు’ ఆఫర్లు


విశాఖపట్నం సిటీ:  నగరంలో మొట్టమొదటి బంగారం షాపిం గ్ మాల్ అయిన సంఘ్వీ జ్యూ యలర్స్ మాల్‌లో 8వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దేశ విదేశాల నుంచి బంగారం ప్రియుల కోసం తీసుకువచ్చిన నాణ్యమైన ఆభరణాలను ప్రదర్శనలో ఉంచారు.



ఇటాలియన్, సింగపూర్‌కు చెందిన చైన్లు, కోల్‌కతా గాజులు, బెంగుళూరు, దక్షిణ్‌లకు చెందిన హారాలు, నెక్లెస్‌లు ఆకట్టుకుంటున్నాయి. జునాగడ్ హారాలు, రాజ్‌కోట్ నెక్లెస్‌లు, కోయంబత్తూర్ వడ్డాణాలు, చెన్నై జెడలు మగువుల మదిని దోచుకుంటున్నాయి.



ఏటా వార్షికోత్సవం సందర్భంగా ఇస్తున్న ఆఫర్ల కంటే ఈ సారి బంపర్ ఆఫర్లను ప్రకటించారు. హాల్‌మార్కడ్ జ్యూయలరీని ప్రవేశపెట్టిన సంఘ్వీ జ్యూయలర్స్ మాల్ ఇకపై వెండి వస్తువులను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా స్టెర్లింగ్ 92.5 నాణ్యతలో అందిస్తున్నారు.

 

 26 వరకు తగ్గింపు

బంగారంపై ఈ నెల 26 వరకు ఆఫర్లు ఇస్తున్నాం. ఆభరణాల కొనుగోలుపై  గ్రాముకు రూ. 100 తగ్గింపు ఇస్తున్నాం. గతంలో గ్రాముపై రూ. 70 కన్నా అధికంగా తగ్గించలేదు. ఐజీఐ సర్టిఫైడ్ వజ్రాభరణాలకు ఒక క్యారెట్ రూ.59, 500 ఖరీదు చేసే వస్తువును రూ. 52 వేలకే అందిస్తున్నాం. సంఘ్వీ జ్యూయలర్స్‌ను ఎప్పుడూ ఆదరించే కష్టమర్ల కోసం భారీ తగ్గింపును అందిస్తున్నాం.

 -రంజిత్‌కుమార్ జైన్,సంఘ్వీ అధినేత

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top