మోదీజీ.. స్వచ్ఛ భారత్ ఇదే!

మోదీజీ.. స్వచ్ఛ భారత్ ఇదే! - Sakshi


స్వచ్ఛభారత్ కార్య్రక్రమం ఆరంభ శూరత్వంగా మిగిలింది. గ్రామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. జిల్లాలో స్వచ్ఛభారత్ అమలుపై ‘సాక్షి’ ఫోకస్

 

నిధుల కైంకర్యమే!

చీరాల మండలంలో  15 గ్రామ పంచాయతీలుండగా ఒక్క గ్రామంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. ఎక్కడి మురుగు అక్కడ నిలిచిపోవాల్సిందే!

మండలానికి 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.50 లక్షలు ఉన్నాయి. అయినప్పటికీ మురుగు చింత తీరడంలేదు.

ఒక్కో గ్రామానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిధులు రూ.10000 మాత్రమే విడుదలవుతున్నాయి.

వేటపాలెం మండలంలో అరుుతే రెండు గ్రామాల్లో మాత్రమే డ్రైనేజీ వ్యవస్థ ఉంది. మిగిలిన చోట్ల గతంలో నిర్మించిన కాలవలకు సైడు గోడలు పడి పోవడంతో వర్షం వచ్చినప్పుడు మురుగు రోడ్లపై పారుతోంది.

అవసరం లేక పోయినా పర్సంటేజీల కోసం డ్రైనేజీలు ఏర్పాటు చేసి పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసిన సంఘటనలున్నాయి.

కేంద్ర ప్రభుత్వం నుంచి శానిటేషన్ కోసం ఆర్థిక సంఘం నిధులు లక్షల్లో విడుదల అవుతున్నాయి. అయితే వాటిని భుజించడానికే ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపుతున్నారు.    -చీరాల టౌన్

 

 మురుగు కాలువలు ఏవీ?

దర్శి నియోజకవర్గ కేంద్రంతో పాటు దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో మురుగు కాలువలు చాలా తక్కువగా ఉండటంతో గ్రామాలు అపరిశుభ్రంగా మారారుు.

సాక్షాత్తు రాష్ట్ర మంత్రి శిద్దా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి పట్టణంలో కూడా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు.

పభుత్వ కార్యాలయూలు, వైద్యశాల ముందు పశువుల దిబ్బలు, ఎర్ర చెరువు వద్ద చెత్తా చెదారం వల్ల దుర్వాసన వస్తోంది.

కురిచేడు మండల గ్రామాల్లో చిన్న పాటి వర్షానికి కూడా రహదారులు బురదమయం కావాల్సిందే!

దొనకొండలో రోడ్లపై నీరు నిలిచిపోతోంది.

ముండ్లమూరులో రోడ్ల వెంబడి పేడ దిబ్బలు దర్శనమిస్తుంటారుు.

పలు గ్రామాల్లో రోడ్లపై గేదెలను కట్టివేస్తుండటంతో పారిశుధ్యం దెబ్బతింటోంది.

తూర్పుగంగవరంలో ప్రధాన వీధుల్లో చెత్తా చెదారం పేరుకుపోరుుంది. -  తాళ్లూరు

 

వ్యాధుల భయం

కొత్తపట్నం మండలంలో పంచాయతీ నిధులు లేకపోవడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోరుు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది.

పభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఎంపీ, ఎమ్మెల్యే కోటాలో ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.

స్వచ్ఛభారత్ పేరుతో ర్యాలీలు చేయడమే కానీ ఒరిగిందేమీ లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో సుమారు 59,622 మంది జనాభా ఉండగా. 13వ ఫైనాన్స్ కింద కోటి యాభై ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయి.

పెద్ద మండలానికి తక్కువ నిధులు విడుదల కావడంతో వాటిని ఎలా సర్దాలో అధికారులకు అర్థం కావడంలేదు.

కేవలం వీధులు చిమ్మడంతోనే పరిశుభ్రత ఎలా వస్తుందని జనం ప్రశ్నిస్తున్నారు.

సంకువానిగుంట, ఆలూరు, గాదెపాలెం, అల్లూరులో నీటి సమస్యతో పాటు పారిశుధ్యం అధ్వానంగా ఉంది.

మురుగు, దోమల దెబ్బకు ప్రాణాంతక వ్యాధులు విజృంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నారుు.  - కొత్తపట్నం

 

 చిత్తడి.. చిత్తడి

మార్కాపురం నియోజకవర్గంలో 83 పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవటంతో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు మొక్కుబడిగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

వర్షాకాలం కావడంతో వీధులన్నీ చిత్తడిగా మారుతున్నారుు. కొన్ని చోట్ల పైపైన బ్లీచింగ్ పౌడర్ చల్లించి చేతులు దులుపుకుంటున్నారు.

    చాలా గ్రామాల్లో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ లేక దుర్గంధం వ్యాపిస్తోంది.

    స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని కూడా సరిగా నిర్వహించలేదు. ఇప్పటికే రోగాలు విజృంభిస్తున్నారుు.  

   గొట్లగట్టు బస్టాండులో దుకాణదారులు చెత్తా చెదారాన్ని రహదారిపైకి ఊడ్చి కుప్పలు చేస్తున్నారు. వృథా నీరంతా రోడ్లపైకి వస్తుండటంతో తారు రోడ్డు గుంతల మయంగా మారుతోంది.

పాతపాడు, వెంగళపల్లి గ్రామాల్లో అరుుతే ముక్కుమూసుకొని నడవాల్సిందే!      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top