శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల : తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 39,910 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లలో వేచిఉన్న భక్తులకు 12 గంటలు, 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న కాలిబాట భక్తులకు 6 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది.
గదుల కోసం భక్తులు పద్మావతి, సీఆర్వో, ఎంబీసీ రిసెప్షన్ కార్యాలయాల వద్ద గంటపాటు వేచి ఉండాల్సి వచ్చింది. తలనీలాలు సమర్పించుకునేందుకు కూడా కల్యాణకట్టల్లో భక్తులు రెండు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది.