ఎస్కేయూ రిజిస్ట్రార్కు షోకాజ్ నోటీసులు


అనంతపురం: శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీ రిజిస్ట్రర్ దశరథ రామయ్యపై ఆర్టీఏ కమిషనర్ తాంతియా కుమారి మండిపడ్డారు.  సమాచార చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనకు ఈసందర్భంగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అలాగే రూ. 2 వేలు జరిమానా విధించారు.


బుధవారం అనంతపురంలో సమాచార హక్కు చట్టంపై తాంతియా కుమారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎమ్మార్వోలు, వ్యవసాయ అధికారులకు నోటీసులు జారీ చేస్తామని ఈ సందర్భంగా తాంతియా కుమారి హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top