అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు


శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గరికపాడు గ్రామ సమీపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు.


సోమవారం రాజాం వెళుతున్న ఆర్టీసీ బస్సు సంతకవిటి మండలం గరికపాడు గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో బస్సులో కిక్కిరిసి ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ప్రమదాం అనంతరం ప్రయాణికులంతా ప్రైవేటు వాహనాల్లో వెళ్లిపోయారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top