వాగులో కొట్టుకు పోయిన ఆర్టీసీ బస్సు


చిత్తూరు: వాగులో బస్సు కొట్టుకుపోయిన సంఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం వెదురు కుప్పం మండలం తెల్లగుండ్లపల్లి వద్ద చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు మంగళవారం వాగు ప్రవాహంలో కొట్టుకుపోయింది.


ఈ సంఘటన జరిగిన సమయంలో బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top