ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి
వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పట్టణానికి చెందిన వీరమోహన్రెడ్డి(40) నాపరాయి పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం 6.45 గంటల సమయంలో అతడు బైక్పై కడపరోడ్డులోని మహేశ్వర్నగర్ నుంచి మెయిన్ రోడ్డుకు వస్తుండగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొంది. ఈ ఘటనలో వీరమోహన్రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.