రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం


చిల్లకూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని బోధనం టోల్‌ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు ఓ వాహనంలో 75 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. వెంటనే  వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top