శ్రీశైలంలో హుండీ ఆదాయం రూ.2.09కోట్లు
శ్రీశైలం: కర్నూలు జిల్లా శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానానికి 40 రోజుల్లో హుండీ ద్వారా రూ.2.09కోట్ల ఆదాయం లభించింది. ఉభయ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా రూ. 2,09,49,779గా తేలినట్టు కార్యనిర్వహణాధికారి సాగర్బాబు తెలిపారు. మంగళవారం శ్రీస్వామి అమ్మవార్ల నిత్య కల్యాణమండపంలో అధికారులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఈ లెక్కింపులో పాల్గొన్నారన్నారు. నగదుతో పాటు 146 గ్రాముల బంగారు, 4 కేజీల 700 గ్రాముల వెండి వచ్చినట్లు తెలిపారు.