వడదెబ్బ మృతులకు రూ. లక్ష ఎక్స్గ్రేషియా
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వడదెబ్బతో మృతిచెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.శుక్రవారం కలెక్టర్లతో సదస్సు అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు.
మృతుల జాబితాను రూపొందించి, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు. తీవ్ర ఎండ, వడగాల్పుల ధాటికి గత రెడు రోజుల్లో ఏపీలో దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. శుక్రవారం ఒక్క ప్రకాశం జిల్లాలోనే 50 మంది మరణించినట్లు సమాచారం.