మహాలక్ష్మమ్మ ఆలయంలో చోరీ


రణస్థలం (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కమ్మసిగడాం గ్రామంలోని మహాలక్ష్మమ్మ ఆలయంలో శనివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న 5 తులాల బంగారు, 50 తులాల వెండి ఆభరణాలు, రూ.లక్ష నగదును ఎత్తుకుపోయారు. ఆదివారం ఉదయం స్థానికులు గమనించటంతో విషయం వెలుగుచూసింది. సర్పంచి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top