సోమవారం లాకర్లో పెడదామనుకుంటే...

సోమవారం లాకర్లో పెడదామనుకుంటే... - Sakshi


శ్రీకాళహస్తి : ఓ వేడుక కోసం బ్యాంకు లాకర్ నుంచి బంగారు ఆభరణాలు తెచ్చుకున్నారు. అవి తిరిగి బ్యాంకు లాకర్‌ను చేరడానికి ఒక్కరోజు ముందు దొంగలు కొల్లగొట్టారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పానగల్ రోడ్డులో విశ్రాంత ఉపాధ్యాయుడు కరుణాకరన్ ఇంట్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదును దొంగలు ఎత్తుకుపోయారు. కరుణాకరన్ దంపతులు ఇంట్లో నిద్రిస్తుండగా దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించుకుని లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలోనే ఉండే కరుణాకరన్ కుమార్తె ఇంట్లో ఇటీవలే ఓ శుభకార్యం జరిగింది. ఆ వేడుకలో పెట్టుకునేందుకు బ్యాంకు లాకర్ నుంచి ఆభరణాలు తెచ్చుకున్నారు.


కార్యక్రమం పూర్తి కాగా, సోమవారం తిరిగి బ్యాంకు లాకర్‌లో పెడదామనుకున్నారు. ఇంతలోనే ఆ సొత్తంతా దొంగల పాలయ్యేసరికి కరుణాకరన్ దంపతులు లబోదిబోమంటున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. తిరుపతి నుంచి వేలిముద్రల నిపుణులను రప్పిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top