స్కూల్ లో 13 కంప్యూటర్లు చోరీ
విజయనగరం : పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన 13 కంప్యూటర్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం వీరనారాయణం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. శనివారం శ్రీరామనవమి పర్వదినం, మరుసటి రోజు ఆదివారం నేపథ్యంలో రెండు రోజులుగా పాఠశాలకు సెలవు దినాలు కావడంతో సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు చోరీ జరిగిన విషయాన్ని గమనించారు. దుండగులు 13 కంప్యూటర్లతో పాటు సీపీయూలు, బ్యాటరీలు ఎత్తుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో సహా సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.