రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ
కర్నూలు: కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి మధుసూదనరావు ఇంట్లో చోరీ జరిగింది. వ్యక్తిగత పనుల నిమిత్తం కుటుంబసభ్యులతో కలిసి కర్నూలు వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 40 తులాల బంగారం, అర కిలో వెండి, రూ.లక్షన్నర నగదు దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం చోరీ జరిగిన విషయం గుర్తించిన స్థానికులు మధుసూధనరావుకు తెలియజేశారు.దీంతో బాధితుడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.