చెన్నై మెయిల్లో దోపిడీ
చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో చెన్నై మెయిల్లో దోపిడీ జరిగింది. కొత్తూర్ వద్ద ఏసీ కోచ్లోని ప్రయాణికుల నుంచి 25 సవర్ల బంగారం, లక్ష రూపాయలకు పైగా నగదు దోచుకుని దోపిడీ ముఠా పరారైంది. బాధితులు కాట్పాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సివుంది.