ఆముదాలవలసలో చోరీ
ఆముదాలవలస: బంధువుల ఇంట్లో అంత్యక్రియలకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి గుల్ల చేశారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని రెడ్డిసెంటర్లో సోమవారం అర్ధరాత్రి జరిగింది. కాలనీకి చెందిన ఆశిర్కుమార్ తన బంధువుల ఇంటికి వెళ్లి మంగళవారం తిరిగి వచ్చి చూసే సరికి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లో వస్తువులన్ని చిందర వందరగా పడిఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాధమిక దర్యాప్తు చేసి ఇంట్లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, నాలుగు తులాల వెండి ఆభరణాలతో పాటు, రూ. 18 వేల నగదు అపహరణకు గురైందని నిర్ధరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.