ఆలయాల్లో వరుస చోరీలు


అనకాపల్లి : విశాఖ జిల్లాలో ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలు జరుగుతున్నాయి. ఒక్కరోజే నాలుగు ఆలయాల్లో చోరీలు చేసి హుండీలను ఎత్తుకెళ్లారు. అనకాపల్లి పట్టణంలోని 4 ఆలయాల్లో సోమవారం అర్థరాత్రి చోరీలను పాల్పడ్డారు. మంగళవారం ఉదయం పూజలు నిర్వహించడానికి వచ్చిన పూజారులు ఈ విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.


దుండగులు ఎత్తుకెళ్లిన హుండీలను సంఘటనా స్థలానికి సమీపంలోనే ధ్వంసం చేసి అందులోని నగదును తీసుకెళ్లారు. మొత్తం నాలుగు హుండీలలో కలిపి సుమారు రూ. 60 వేల వరకు నగదు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని పలు ఆలయాల్లో ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో పోలీసులు ఈ కేసుపై దృష్టి సారించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top