అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్


పెద్దవాల్తేరు: పోలీసులమంటూ బెదిరింపులకు దిగి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు తుపాకలు, రూ. 2 లక్షల నగదుతో పాటు రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా పెద్దవాల్తేరు ప్రధాని రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తాడ్చాడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం తెలిసింది. వీరు 5 జిల్లాల పరిధిలో మొత్తం 19 చోట్ల నేరాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top