పదిరూపాయలు చూపి... మూడు లక్షలతో పరార్
నెల్లూరు(వెంకటగిరి): ఈ డబ్బులు మీవేనా.. అని ఏమార్చి నగదును అపహరించిన సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. మంగళవారం అచ్చం సినీఫక్కీలో జరిగిన ఇలాంటి సంఘటన వెంకటగిరి ఎస్బీఐ ఎదుట జరిగింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని రాణీపేటకు చె ందిన ఎ.చిన వెంకటసుబ్బయ్యకు ఇటీవలే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఐదు ల క్షల రూపాయలు వచ్చాయి. మంగళవారంబ్యాంకు నుంచి రూ. 3.25 లక్షలు విత్డ్రా చేశాడు. డబ్బును బ్యాగులో పెట్టుకొని తన సైకిల్కున్న స్టాండ్పై దాన్ని ఉంచి తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు దారిలో పది రూపాయల నోటు వేసి.. ఇది మీదేనా మాస్టారూ.. అని అనడంతో సుబ్బయ్య సైకిల్ స్టాండ్ వేసి దాన్ని తీసుకునేలోపే సైకిల్పైఉన్న డబ్బుసంచితో ఉడాయించారు. ఈ మేరకు వెంకటగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.