బ్యాంకులో వీలవ్వక...పక్కింట్లో కొట్టేశారు
విశాఖపట్నం: విశాఖ జిల్లా అచ్యుతాపురం మండల కేంద్రంలోని హరిపాలెంలో ఏపీ గ్రామీణ వికాస బ్యాంకులో సోమవారం అర్ధరాత్రి దుండగులు దొంగతనానికి విఫలయత్నం చేశారు. కుదరకపోయేసరికి బ్యాంకు పక్కనే నివాసం ఉండే హరిబాబు ఇంట్లోకి చొరబడి నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పరారయ్యారు. తొలుత బ్యాంకు వెనుకవైపు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన దొంగలు ఉత్తచేతులతో వెనుదిరిగినట్టు పోలీసులు గుర్తించారు.