లారీ ఢీకొని యువతి మృతి
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో శనివారం రాత్రి లారీ ఢీకొన్న ఘటనలో ఓ యువతి మృతి చెందింది. విజయవాడ సింగ్ నగర్కు చెందిన షబాన (30) సోదరుడు షేక్ బాషాతో కలసి శనివారం గోసాల గ్రామం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో బైక్పై విజయవాడ వైపు వెళుతుండగా 100 అడుగుల రోడ్డుపై ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో షబాన తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. షాక్కు గురైన బాషాను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.