సింగపూర్ అయిపోయింది, ఇక న్యూజిలాండ్!
హైదరాబాద్: ఏపిని సింగపూర్లా చేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు న్యూజిలాండ్లా చేస్తానని అంటున్నారు. టూరిజం శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
న్యూజిలాండ్ తరహాలో ఏపిని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ట్రావెల్ అండ్ టూరిజం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
**