ఆలయ స్థలంలో ఆక్రమణల తొలగింపు
అక్రమ కట్టడాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని శ్రీకూర్మం ఆలయ పరిధిలోని యాత్రాస్థలాన్ని ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహించుకుంటున్నవారిపై రెవెన్యూ, పోలీస్ అధికారులు కన్నెర్రజేశారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఆలయ పరిధిలో జరిపే ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఆరెకరాల స్థలంలో కొందరు స్థానికులు గుడిసెలు వేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో.. పదిరోజుల కిందట సాక్షి పత్రికలో వచ్చిన కథనం తోడ్పడింది. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఆక్రమణలు తొలగిస్తున్నారు.