1న తెలుగు రాష్ట్రాల్లో ధార్మిక విజ్ఞాన పరీక్ష
తిరుపతి సిటీ: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 32వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్ష నిర్వహించనున్నట్లు పీఆర్వో రవి శనివారం తెలిపారు. విద్యార్థులకు సనాతన హైందవ ధర్మం, మానవీయత, నైతిక విలువలు తెలియజేసేందుకే ఏటా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 6,7 తరగతి విద్యార్థులకు ధర్మపరిచయం, 8, 9, 10 తరగతి విద్యార్థులకు ధర్మప్రవేశిక పేర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 9గం.నుంచి మధ్యాహ్నం 12 గం.వరకు పరీక్ష జరుగుతుందన్నారు.