1న తెలుగు రాష్ట్రాల్లో ధార్మిక విజ్ఞాన పరీక్ష


తిరుపతి సిటీ: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1న ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 32వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్ష నిర్వహించనున్నట్లు పీఆర్వో రవి శనివారం తెలిపారు. విద్యార్థులకు సనాతన హైందవ ధర్మం, మానవీయత, నైతిక విలువలు తెలియజేసేందుకే ఏటా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 6,7 తరగతి విద్యార్థులకు ధర్మపరిచయం, 8, 9, 10 తరగతి విద్యార్థులకు ధర్మప్రవేశిక పేర్లతో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 9గం.నుంచి మధ్యాహ్నం 12 గం.వరకు పరీక్ష జరుగుతుందన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top