వాహనదారులకు ఊరట
తిరుపతి క్రైం: హెల్మెట్ వాడాలనే నిబంధనపై ఊరట కల్గించేలా రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులను వేధించవద్దని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు జిల్లా అధికారులను ఆదేశించారు. మొదట హెల్మెట్లపై విస్తృత ప్రచారానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.
హెల్మెట్ లేనివారి నుంచి జరిమానాలను వసూలు చేయడంపై దృష్టి పెట్టకుండా 2, 3 నెలల పాటు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. శనివారం రాత్రి జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల ఉన్నతాధికారుల వీడియో కాన్ఫెరెన్స్లో ఈ మేరకు ఆదేశాలు వెలువరించారు.