సోమవారం నుంచి విశాఖలో పరేడ్ రిహార్సల్స్


హైదరాబాద్ : ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని విశాఖపట్నంలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పోలీసు శాఖ సమాయత్తం అవుతోంది. ఈ వేడుకల్లో పోలీసు పరేడ్ ప్రధానమైన అంశం. దీన్ని పక్కాగా నిర్వహించడం కోసం కొన్ని రోజుల ముందు నుంచీ రిహార్సల్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం (ఆగస్టు 3) నుంచి వీటిని ప్రారంభించాలని డీజీపీ కార్యాలయం నిర్ణయించింది.



డీజీపీ జేవీ రాముడు నేతృత్వంలో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నాటికే రిహార్సల్స్‌లో పాల్గొనే పోలీసు బలగాలను విశాఖపట్నం తరలించనున్నారు. ఆర్కే బీచ్‌కు ఆనుకుని ఉన్న రోడ్డులో సముద్రానికి అభిముఖంగా ప్రధాన వేదిక ఏర్పాటు చేయనున్నారు. పరేడ్ సైతం ఈ రోడ్డులోనే జరుగుతుందని అధికారులు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top