రూ. 50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం


సీతారామపురం: అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం దేవమ్మ చెరువు అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజాము నంచి అటవీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడులలో 65 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top