నవవధువు ఆత్మహత్య
కంచికచర్ల (కృష్ణా జిల్లా) : ఉరి వేసుకుని నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గోపికి రెండు నెలల క్రితం విజయలక్ష్మి(20)తో వివాహం అయింది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. గోపి వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో మనస్తాపానికి గురైన విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకొని ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.