22 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత


సత్తెనపల్లి: పెద్ద మొత్తంలో అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో శుక్రవారం ఉదయం పోలీసులు లారీలో తరలిస్తున్న 22 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బియ్యాన్ని పిడుగురాళ్ల నుంచి కాకినాడకు తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top