మౌలిక వసతుల కోసం ర్యాలీ


కడప : కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలంటూ ఆసుపత్రి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్థానిక వై.ఎస్.ఆర్.సి.పి ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఆసుపత్రిలో వసతుల లేమితో ఇక్కడకు వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.


ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన వసతులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.

(ప్రొద్దుటూరు)

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top