'అబద్ధాలతోనే వంద రోజుల పాలన'

'అబద్ధాలతోనే వంద రోజుల పాలన'


విజయనగరం: అబద్ధాలు చెబుతూనే చంద్రబాబు 100 రోజులూ పాలన సాగించారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి.రాజన్నదొర ఆరోపించారు. ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ప్రమాణస్వీకారం రోజున చంద్రబాబు 5 సంతకాలు చేసిన పథకాలు నేటికి కూడా అమలు కావడం లేదని తెలిపారు.



రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా టీడీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పంట రుణాల మాఫీ విషయంలో రైతులను టీడీపీ నాయకులు గందరగోళానికి గురి చేస్తున్నారని రాజన్నదొర మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top