శ్రీవారిని దర్శించుకున్నప్రముఖులు
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి, శాసనమండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్య తదితరులు కూడా వీఐపీ విరామ సమయంలో ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.