'ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలం'
అనంతపురం:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు నాయుడు విఫలం చెందారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన సమయంలోపలు అంశాలపై కాంగ్రెస్ సర్కార్ చట్టం చేసినా.. వాటిని కూడా కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. రాజధానికి వెయ్యి ఎకరాల అవసరం అయితే 30 వేల ఎకరాల బలవంతం సేకరణ చేయడాన్ని రఘువీరా తప్పుబట్టారు. హామీల అమలులో కూడా చంద్రబాబు చిత్తశుద్ధి చూపలేదన్నారు.