'ఇచ్చిన హామీలు నిలబెట్టుకో బాబూ'

'ఇచ్చిన హామీలు నిలబెట్టుకో బాబూ' - Sakshi


తిరుపతి: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తిరుపతిలో చేపట్టిన సత్యాగ్రహం కార్యక్రమంలో రఘువీరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జన్మభూమి సాక్షిగా టీడీపీ పాలన బట్టబయలవుతుందని అన్నారు. ఈ జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇచ్చిన హామీలపై నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తమ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top