రూ. లక్ష విలువైన గుట్కాలు పట్టివేత


పాలకొల్లు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండల సంతలపూడేరు గ్రామ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రూ. లక్ష విలువ చేసే గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. వివరాలు.. భీమవరం నుంచి పాలకొల్లుకు అక్రమంగా గుట్కాను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భీమవరం-పాలకొల్లు రోడ్డులో తనిఖీలు నిర్వహించి గుట్కాను తరలిస్తున్న వ్యాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాన్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top