పుష్కరాల పనుల్లో స్తబ్దత
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో అట్టహాసంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే దేవాదాయ శాఖకు ఒక్కపైసా కూడా అందకపోవడంతో పనులు చేయలేకపోతున్నామని అధికారులు వాపోతున్నారు. కేంద్రం నుంచి దాదాపు రూ. 300 కోట్లు వస్తాయని దేవాదాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏర్పాట్లలో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం నుంచి కూడా రూ. 100 కోట్లను విడుదల చేయాలని ఆ శాఖ కోరింది. అయితే రూ. 17 కోట్లు మాత్రమే ఇచ్చేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నిధులు సరిపోవని దేవాలయాల నిర్వాహకులు పెదవి విరుస్తున్నారు. దీనిపై సోమవారం జరిగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో చర్చించే అవకాశముంది.