హత్యా రాజకీయాలపై జనాగ్రహం
కర్నూలు బంద్ విజయవతం
కర్నూలు అర్బన్/ సిటీ: తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలపై జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తికొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణహత్యను నిరసిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా సోమవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ప్రజలు స్వచ్ఛందంగా వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేసి బంద్కు సంఘీభావం తెలిపారు. పార్టీ పిలుపు మేరకు చేపట్టిన బంద్ సందర్భంగా పలు ప్రాంతాల్లో బైక్ ర్యాలీలు చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్న పార్టీ కార్యకర్తలు, నాయకులను అరెస్ట్ చేసి, సొంత పూచీకత్తుపై వదిలేశారు.