కైలాసకోనలో కామకేళి

కైలాసకోనలో కామకేళి - Sakshi


తిరుపతి: చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసకోనలోని ఏపీ టూరిజం అతిథిగృహంలో వ్యభిచార కార్యకలాపాలు వెలుగుచూడడంతో పర్యాటక శాఖలో కలకలం రేగింది. అక్కడ చాలాకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. గెస్ట్ హౌస్ సిబ్బందే చెన్నై నుంచి విటులను రప్పించి ఈ వ్యవహారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది.



వ్యభిచార ముఠా పట్టుబడిన గది బుధవారం తెల్లవారుజామున చెన్నైకి చెందిన ఓ యువకుడు బుక్ చేసుకున్నాడు. తర్వాత మరో ఇద్దరు యువకులు దిగారు. పుత్తూరుకు చెందిన ఇద్దరు యువతులు అనంతరం గదిలోకి ప్రవేశించారు. మధ్యాహ్నం వరకు రాసలీలలు సాగినా టూరిజం సిబ్బంది పట్టించుకోలేదు. 'సాక్షి' కథనంతో టూరిజం శాఖ స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top